కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మత్తయి 4:11సుమారు క్రీ.శ. 26

    అపవాది ఆయనను విడిచి వెళ్లిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.

  2. మత్తయి 4:12సుమారు క్రీ.శ. 26

    యోహాను చెరసాలలో వేయబడ్డాడని విన్న తర్వాత యేసు గలిలయకు వెళ్లారు.

  3. మత్తయి 4:13సుమారు క్రీ.శ. 26

    ఆయన నజరేతును వదిలి జెబూలూను, నఫ్తాలి ప్రాంతపు సముద్రతీరాన ఉన్న కపెర్నహూముకు వెళ్లారు. వారు అక్కడ కొన్ని రోజులు నివసించారు.

  4. మత్తయి 4:14సుమారు క్రీ.శ. 26

    ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన:

  5. మత్తయి 4:15సుమారు క్రీ.శ. 26

    “జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో, యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో, యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతంలో,

  6. మత్తయి 4:16సుమారు క్రీ.శ. 26

    చీకటిలో నివసిస్తున్న ప్రజలు, గొప్ప వెలుగును చూశారు; మరణచ్ఛాయలో నివసించేవారి మీద ఒక వెలుగు ప్రకాశించింది” అనే మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.

  7. మత్తయి 4:17సుమారు క్రీ.శ. 26

    అప్పటినుండి యేసు, “పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని ప్రకటించడం మొదలుపెట్టారు.

  8. మత్తయి 4:18సుమారు క్రీ.శ. 26

    యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు పేతురు అని పిలువబడే సీమోను, అతని సోదరుడు అంద్రెయ అనే ఇద్దరు సోదరులు సముద్రంలో వలలు వేయడం ఆయన చూశారు. వారు జాలరులు.

  9. మత్తయి 4:19సుమారు క్రీ.శ. 26

    యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు.

  10. మత్తయి 4:20సుమారు క్రీ.శ. 26

    వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు.

  11. మత్తయి 4:21సుమారు క్రీ.శ. 26

    ఆయన అక్కడినుండి వెళ్తూ జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అనే మరో ఇద్దరు సోదరులను చూశారు. వారు తమ తండ్రి జెబెదయితో కలసి పడవలో ఉండి తమ వలలను సిద్ధం చేసుకుంటున్నారు. యేసు వారిని పిలిచారు.

  12. మత్తయి 4:22సుమారు క్రీ.శ. 26

    వెంటనే వారు పడవను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.

  13. మత్తయి 4:23సుమారు క్రీ.శ. 26

    యేసు గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ, వారి సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ప్రజల మధ్యలో ప్రతి వ్యాధిని రోగాన్ని బాగుచేస్తూ ఉన్నారు.

  14. మత్తయి 4:24సుమారు క్రీ.శ. 26

    ఆయన గురించి సిరియా దేశమంతటా తెలిసి ప్రజలు రకరకాల వ్యాధులతో, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నవారిని, దయ్యాలు పట్టినవారిని, మూర్ఛ రోగం గలవారిని పక్షవాత రోగులను యేసు దగ్గరకు తీసుకుని రాగా ఆయన వారిని బాగుచేశారు.

  15. మత్తయి 4:25సుమారు క్రీ.శ. 26

    గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ, యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతాల నుండి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించారు.

  16. మత్తయి 5:1సుమారు క్రీ.శ. 31

    యేసు ఆ జనసమూహాన్ని చూసి కొండ మీదికి వెళ్లి కూర్చుని ఉండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు.

  17. మత్తయి 5:2సుమారు క్రీ.శ. 31

    అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన ఇలా బోధించారు:

  18. మత్తయి 5:3సుమారు క్రీ.శ. 31

    “ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే.

  19. మత్తయి 5:4సుమారు క్రీ.శ. 31

    దుఃఖించే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు.

  20. మత్తయి 5:5సుమారు క్రీ.శ. 31

    సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు.

  21. మత్తయి 5:6సుమారు క్రీ.శ. 31

    నీతి కోసం ఆకలిదప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపొందుతారు.

  22. మత్తయి 5:7సుమారు క్రీ.శ. 31

    కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.

  23. మత్తయి 5:8సుమారు క్రీ.శ. 31

    హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు.

  24. మత్తయి 5:9సుమారు క్రీ.శ. 31

    సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు.

  25. మత్తయి 5:10సుమారు క్రీ.శ. 31

    నీతి కోసం హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే.