మత్తయి 5:2
చుట్టుపక్కల సందర్భంతో వచనం 2 చూపబడుతోంది.
1
యేసు ఆ జనసమూహాన్ని చూసి కొండ మీదికి వెళ్లి కూర్చుని ఉండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు.
2
అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన ఇలా బోధించారు:
3
“ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే.
4
దుఃఖించే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు.
5
సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు.
Settings