కీర్తనలు 105:28-38
28
యెహోవా చీకటిని పంపి చీకటి కమ్మేలా చేశారు; వారు ఆయన మాటలను వ్యతిరేకించలేదు.
29
ఆయన వారి జలాలను రక్తంగా మార్చారు, వారి చేపలన్నిటిని చనిపోయేలా చేశారు.
30
వారి దేశం కప్పలతో నిండిపోయింది, వారి రాజుల గదుల్లోకి కూడా వెళ్లాయి.
31
ఆయన ఆజ్ఞ ఇవ్వగా, జోరీగలు వచ్చాయి, వారి దేశమంతటా దోమలు వచ్చాయి.
32
దేశమంతటా ఆయన మెరుపులు మెరిపిస్తూ, వడగండ్ల వాన కురిపించారు.
33
ఆయన వారి ద్రాక్షతీగెలను అంజూర చెట్లను పడగొట్టారు వారి దేశంలోని వృక్షాలను విరగ్గొట్టారు.
34
ఆయన ఆజ్ఞ ఇవ్వగా మిడతలు, లెక్కలేనన్ని చీడ పురుగులు వచ్చి పడ్డాయి.
35
ఆ దేశంలో కూరగాయల మొక్కలన్నిటినీ పురుగులు తినేశాయి, భూమి పంటలను తినేశాయి.
36
వారి దేశంలో ఉన్న జ్యేష్ఠులందరిని వారి ప్రథమ సంతానమంతటిని ఆయన హతమార్చారు.
37
ఇశ్రాయేలీయులను వెండి బంగారములతో దేవుడు బయిటకి రప్పించాడు. ఆయన ఇశ్రాయేలు గోత్రాల్లో ఎవరూ తొట్రుపడరు.
38
వారంటే ఈజిప్టువారికి భయం పట్టుకుంది, వారు వెళ్లి పోతుంటే, వీరు సంతోషించారు.
Settings